•ఏపీ సీఎంను కలిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి
మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి25
‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ మహత్తర లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా నగరి నియోజకవర్గానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నగరి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరిన ఆయన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు సీఎం చంద్రబాబు అడుగులు
RELATED ARTICLES

