•నూతన అధికారులకు శాలువాలతో సత్కారం, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు
మునిపల్లి,జనవరి22(మనప్రజాప్రతినిధి):
మునిపల్లి మండలానికి నూతనంగా నియమితులైన ఎమ్మార్వో మరియు ఎంపీడీవోలను గురువారం రోజు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మాదిగ జంగం విజయ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన అధికారులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో దండోరా సాంస్కృతిక కళాకారులు నరేంద్ర మాదిగ, జీవన్ మాదిగ, మొగులయ్య మాదిగ, శ్రీను మాదిగ, నర్సింలు, అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన ఎమ్మార్వో, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జంగం విజయ్ ప్రసాద్
RELATED ARTICLES

