Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రయాణికుల భద్రతే లక్ష్యం – రోడ్డు భద్రతపై సీఐ వెంకటేష్ సూచనలు

ప్రయాణికుల భద్రతే లక్ష్యం – రోడ్డు భద్రతపై సీఐ వెంకటేష్ సూచనలు

📰 Generate e-Paper Clip

మద్యం సేవించి వాహనం నడపొద్దు-డ్రైవర్లకు సీఐ హెచ్చరిక

ఆటో,లారీ డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి– సీఐ వెంకటేష్
సదాశివపేట,జనవరి20(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సదాశివపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో, లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు, రహదారి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సదాశివపేట సీఐ వెంకటేష్ మాట్లాడుతూ, డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడిపి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని అన్నారు.మద్యం సేవించి వాహనం నడపరాదని, వాహనానికి సంబంధించిన లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ వంటి అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.అతివేగంగా వాహనాలు నడపకూడదని, లైన్ క్రాసింగ్ చేయరాదని, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేయకూడదని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular