మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి, ఫిబ్రవరి26
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు రాష్ట్రమంతటా ప్రారంభం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని సూచిస్తూ జనసేన పార్టీ అనేది ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పార్టీ, ప్రజల పట్ల నిలబడేటువంటి పార్టీ, మన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసేటువంటి సహాయ, సహకారాలలో మనం అందరం కూడా భాగస్వాములై మన వంతుగా సభ్యత్వం ద్వారా జనసేన పార్టీ సిద్ధాంతాలకు కృషి చేయాలని తెలపడం జరిగింది, మరియు సభ్యత్వం రుసుము 400 రూపాయలు దీని ద్వారా సభ్యత్వంతీసుకున్నటువంటి వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినట్లయితే 5 లక్షల భీమా కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి అండగా తన వంతు సహాయంగా ఇస్తున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , వీర మహిళలు పాల్గొనడం జరిగింది.

