📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగుండెపోటుతో పుట్టి సావిత్రి మృతి

గుండెపోటుతో పుట్టి సావిత్రి మృతి

📰 Generate e-Paper Clip

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్‌కు పరామర్శలు
మెదక్జిల్లా,రామయంపేట్ మండలం,ఫిబ్రవరి23(మనప్రజాప్రతినిధి):
రామయంపేట్ మండలానికి చెందిన పుట్టి సావిత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.ఆమె మరణ వార్త తెలుసుకున్న నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్‌ను పరామర్శించిన వారిలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ గజవాడ యాదగిరి, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రజిత్, సందీప్, దాకి స్వామి, ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మానేగాల రామకృష్ణయ్య, పర్సనల్ సెక్రటరీ రాజకిషన్ తదితరులు పాల్గొని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular