•ప్రజాప్రదేశాల్లో అశాంతిసృష్టించే వారిపైకఠిన చర్యలు-పోలీసుల హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి12
సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలో బుర్గుపల్లి శివారులో పోలీసుల ప్రత్యేక తనిఖీలు – చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలు
బుర్గుపల్లి శివారులోని పబ్లిక్ ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న జి. వంశీ ప్రసాద్ (తండ్రి: శ్రీనివాస్) ను పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిక్ష విధించి జైలుకు తరలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

