📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమత్తు పదార్థాల విక్రయంపై ఉక్కుపాదం

మత్తు పదార్థాల విక్రయంపై ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

విక్రయిస్తే తప్పని కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్
మెదక్.మనప్రజాప్రతినిధి//జనవరి3
మెదక్ జిల్లాలో ప్రజా భద్రతతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్లాదుర్గం మండలంలో డాగ్ స్క్వాడ్ సహకారంతో ఆకస్మికతనిఖీలు నిర్వహించారు.అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఐబీ చౌరస్తా పరిధిలోని కిరాణా దుకాణాలు, కల్లు దుకాణాలను సోదా చేశారు. గంజాయి, నకిలీ మందులు, నిషేధిత డ్రగ్‌లు వంటి మత్తు పదార్థాల విక్రయం జరుగుతుందా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.తనిఖీల సందర్భంగా దుకాణదారులను పోలీసులు కఠినంగా హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడితే చట్టప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలు మరియు చట్టపరమైన శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఏ చిన్న ఉల్లంఘన గుర్తించినా వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా యువతను మత్తు పదార్థాల ప్రభావం నుంచి దూరంగా ఉంచడంతో పాటు, సమాజంలో చట్టానికి గౌరవం పెంపొందించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.పోలీసుల ఆకస్మిక తనిఖీలను స్థానికులు, వ్యాపారులు స్వాగతిస్తూ పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. మొత్తంగా, మెదక్ జిల్లా పోలీస్ శాఖ మత్తు పదార్థాల నియంత్రణలో కఠిన వైఖరితో ముందుకు సాగుతోందని ఈ తనిఖీలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular