మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 2:
మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఖేడ్ మున్సిపాలిటీలో 153 నామినేషన్ లు రాగా సోమవారం 8మంది తమ నామినేషన్ లు విత్ డ్రా చేసుకున్నట్లు ఏడిఈఏ జె.జగ్జీవన్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. 3 రోజుల నామినేషన్ ల సందర్బంగా అన్ని పార్టీలు,స్వతంత్ర అభ్యర్థుల నుండి మొత్తం 153 నామినేషన్ లు దాఖలు అయినా విషయం తెలిసిందే అన్నారు. మంగళవారం వరకు నామినేషన్ ల విత్ డ్రా ఉండడంతో సోమవారం నాడు 6వ వార్డులో కాంగ్రెస్ నుండి కోట రాజు, భగవాన్ రాములు,7వ వార్డులో బిఆర్ఎస్ నుండి మొండి ప్రతిభ,8వ వార్డులో కాంగ్రెస్ నుండి మహారుద్రప్ప(మారుతి),9వ వార్డులో పండరిరెడ్డి,11వ వార్డులో చీలపల్లి సరిత,13వ వార్డులో కాంగ్రెస్ నుండి మహారుద్రప్ప(మారుతి ),14వ వార్డులో కాంగ్రెస్ నుండి ఆఫ్రిన్ సుల్తానాలు తమ నామినేషన్ లు విత్ డ్రా చేసుకున్నారు అన్నారు.

