📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశివాయిపల్లి గ్రామంలో ఆర్థిక చైతన్య జ్యోతిపొదుపే భవిష్యత్తుకు భరోసా – బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు స్పష్టమైన...

శివాయిపల్లి గ్రామంలో ఆర్థిక చైతన్య జ్యోతి
పొదుపే భవిష్యత్తుకు భరోసా – బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు స్పష్టమైన మార్గదర్శనం

📰 Generate e-Paper Clip

ఆర్థికఅక్షరాస్యతతోగ్రామాభివృద్ధికిబాటలువేసినబ్యాంకుఅధికారులు
మెదక్ జిల్లా,ఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):
శివాయిపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (FLC) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశం గ్రామంలో ఆర్థిక చైతన్యాన్ని రగిలించింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మెదక్ మార్కెట్ ఏరియా మేనేజర్ రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవల ప్రాముఖ్యత, డిజిటల్ లావాదేవీల భద్రత, పొదుపు అలవాటు, రుణాల సరైన వినియోగం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ప్రజలు మోసాలకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలియజేశారు. అటెండర్ రాజు కూడా ఖాతా నిర్వహణ, ATM వినియోగం, ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్తల గురించి సూచనలు అందించారు.గ్రామ సర్పంచ్ పాల్గొని బ్యాంకు అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ – ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలంటే ఆర్థిక అక్షరాస్యత అవసరమని, ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular