📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేటలో కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాలెండర్ ఆవిష్కరణ

సిద్దిపేటలో కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.జనవరి9

సిద్దిపేట: కురుమ ఉద్యోగుల సంఘం-సిద్దిపేట జిల్లా (Regd. No. 157/2021) ఆధ్వర్యంలో “స్వాగతం – సుస్వాగతం” కార్యక్రమంలో భాగంగా కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమం శనివారం ఉదయం 9.30 గంటలకు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవన్‌లో (సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన) జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారు హాజరై కాలెండర్‌ను ఆవిష్కరించి కురుమ ఉద్యోగుల సంఘ సభ్యులకు మార్గదర్శనం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంతో పాటు కుల బంధువుల. ఆత్మీయ సమావేశం నిర్వహించబడుతుందని, సమాజ అభివృద్ధి, ఐక్యత, కురుమ ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చ జరగనుందని సంఘ నాయకులు తెలిపారు.కురుమ ఉద్యోగులు, కులబంధువులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సంఘ అధ్యక్షులు, కార్యదర్శి వర్గం కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular