📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణ50 ఎకరాల భూ సేకరణ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

50 ఎకరాల భూ సేకరణ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక, నవంబర్ 18:

మల్లన్న సాగర్ నుండి హైద్రాబాద్ కు తాగునీటి అందించడం కోసం హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ లో భాగంగా కుకునూరుపల్లి మండలంలోనీ తిప్పారం గ్రామంలో 50 ఎకరాలు భూ సేకరణ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లన్న సాగర్ వెంబడి రా వాటర్ పంపు హౌస్ పక్కన భూమి సేకరించినట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్ కి తెలిపారు.  భూమి చదును చేసి హద్దులు పాతాలని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు భూమిని పరిశీలించి ప్రాజెక్ట్ కావలసిన మ్యాపింగ్ రూపొందించాలని తెలిపారు.కలెక్టర్ వెంట ఆర్డీవో చంద్రకళ, తహసిల్దార్, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular