📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణతెలంగాణ  డయాగ్నస్టిక్ సెంటర్ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ  డయాగ్నస్టిక్ సెంటర్ ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్ల
నవంబర్,22

ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల గారు తెలంగాణ డయాగ్నెట్ స్టిక్ సెంటర్ ను, తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. తెలంగాణ  డయాగ్నస్టిక్ సెంటర్లలో నిర్వహించే రక్త నమోనా పరీక్షలను, రిజిస్టర్ను పరిశీలించి సరియైన రిపోర్టులు అందించి ప్రజల వ్యాధులను అరికట్టులలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. తంగళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల రిజిస్టర్లను పరిశీలించి, చిన్నపిల్లల తల్లిదండ్రులకు వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించి పిల్లలకు సకాలంలో టీకాలు తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేయవలసిందిగా  మండల వైద్యాధికారి డాక్టర్ స్నేహ గారికి మరియు వైద్య సిబ్బందికి దిశ నిర్దేశించినారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular