📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల, జనవరి2(మనప్రజాప్రతినిధి)
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత శుక్రవారం కోనరావుపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులు, అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రధానాంశాలు:గర్భిణీ స్త్రీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఆరోగ్య పరీక్షల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని పర్యవేక్షించారు.కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ సురేష్ తో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.
సాధారణ ప్రసవాలు (Normal Deliveries) సకాలంలో జరిగేలా, గర్భిణీలకు అవగాహన కల్పించి, వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు.ఎన్.సి.డి (NCD), టీబీ (TB) వ్యాధి నిర్ధారణ మరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.ఆరోగ్య లక్ష్యాలను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని వైద్యాధికారులకు స్పష్టంగా చెప్పారు.
మరోవైపు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేంద్రబాబు, డిప్యూటీ డెమో రాజకుమార్ పాల్గొని నిబంధనల అమలును పరిశీలించారు.
కార్యక్రమంలో సి.హెచ్.ఓ బాలచంద్రం మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular