Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకొడంగల్‌లో రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

కొడంగల్‌లో రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

విద్య–అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం
రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు
కోస్గి మార్కెట్‌, బంజారా భవన్‌ అభివృద్ధికి చర్యలు

కొడంగల్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నూతన ఊపు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్న హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ సేవలను మెరుగుపరచేందుకు రూ. 5.83 కోట్లు వ్యయంతో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి పునాది వేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 5.01 కోట్లు మళ్లి 23 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. గ్రామ పాలన బలపడేందుకు 10 గ్రామ పంచాయతీలకు రూ. 3 కోట్లు వెచ్చించి కొత్త భవనాలను నిర్మించనున్నారు. బంజారా భవన్‌కు అదనపు సదుపాయాలను అందించేందుకు రూ. 3.65 కోట్లు, కొడంగల్‌లో నిషేధ మరియు ఉత్పాదక పన్ను శాఖ కోసం రూ. 1 కోటి, అగ్నిమాపక కేంద్రం కోసం రూ. 1.30 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. కమ్యూనిటీ హాళ్లు, వంటశాల షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ. 4.91 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు. సిసి రోడ్లు, భూగర్భ కాలువ వ్యవస్థ కోసం రూ. 4.45 కోట్లు ఖర్చు చేయనున్నారు. కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణకు భారీగా రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు. అదనంగా, గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ. 5 కోట్లు, కోస్గి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ. 4.50 కోట్లు కేటాయించారు.
కొడంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular