Friday, February 27, 2026
ads
Homeస్పోర్ట్స్2027 తర్వాత మరో ఐసీసీ టోర్నీకి కోహ్లీ, రోహిత్‌?

2027 తర్వాత మరో ఐసీసీ టోర్నీకి కోహ్లీ, రోహిత్‌?

📰 Generate e-Paper Clip

ముంబై, నవంబర్13 (మనప్రజాప్రతినిధి ): భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త! క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటింగ్‌ ద్వయంగా పేరొందిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కూడా ఒక కీలక ఐసీసీ (ICC) టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కేవలం 2027 వన్డే ప్రపంచ కప్‌ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారని భావిస్తున్న తరుణంలో, వారి కెరీర్ ప్రణాళికలు అంతకు మించి కూడా కొనసాగవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఐసీసీ (ICC) వన్డే సూపర్ లీగ్‌ను పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంటే, ఐసీసీ వన్డే సూపర్ లీగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, రోహిత్, కోహ్లీలు మరో ఐసీసీ టోర్నీలో పాల్గొనే ఛాన్స్ ఉందన్నమాట.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 50 ఓవర్ల ఫార్మాట్‌పై ఆసక్తిని పునరుద్ధరించడానికి వన్డే (ODI) సూపర్ లీగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఇటీవలి త్రైమాసిక సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. 2023 ప్రపంచ కప్ తర్వాత నిలిపివేసిన ఈ లీగ్‌ను తిరిగి ప్రవేశపెట్టే దిశగా ఇది మొదటి అడుగు.ముఖ్యంగా, భారతదేశంలో జరిగిన 2023 ప్రపంచ కప్‌కు క్వాలిఫికేషన్ మార్గంగా ఐసీసీ 2020లో వన్డే సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. 12 పూర్తి స్థాయి సభ్యులు, నెదర్లాండ్స్‌తో సహా 13 జట్లతో కూడిన ఈ లీగ్, అంతర్జాతీయ కట్టుబాట్ల కారణంగా కేవలం ఒక సైకిల్ తర్వాత నిలిపివేశారు.
50 ఓవర్ల క్రికెట్‌కు ఊపిరి పోసేందుకు ఐసీసీ ప్రయత్నం..
వన్డే సూపర్ లీగ్ సమయంలో, ప్రతి జట్టు నాలుగు హోమ్, నాలుగు విదేశీ సిరీస్‌లతో సహా మొత్తం ఎనిమిది మూడు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. టాప్ ఏడు జట్లు 2023 ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించగా, మిగిలిన జట్లు అదనపు క్వాలిఫైయర్స్‌లో పోటీపడతాయి.అయితే, టీ20 క్రికెట్ వృద్ధి, ఫ్రాంచైజీ లీగ్‌ల ఆధిపత్యం పెరగడం వల్ల అంతర్జాతీయ క్యాలెండర్‌లో ఇతర ఫార్మాట్‌లకు తక్కువ స్థానం లభించింది. ప్రకారం, ఐసీసీ కొత్తగా సూపర్ లీగ్‌ను పునరుద్ధరించాలని యోచిస్తోంది.సవరించిన ఫార్మాట్‌లో, టీ20 టోర్నమెంట్‌లతోపాటుగా విండోలను సర్దుబాటు చేయవచ్చు. ఇది అన్ని దేశాలకు మరింత సమతుల్యమైన ఆట వాతావరణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా, పునరుద్ధరించిన ఈ లీగ్‌ను 2031 వన్డే ప్రపంచ కప్‌నకు నేరుగా క్వాలిఫికేషన్ మార్గంగా ఉపయోగించే అవకాశాన్ని కూడా ఐసీసీ పరిశీలిస్తోంది.
ఎన్ని జట్లు అనే దానిపై స్పష్టత లేదు..
వన్డే సూపర్ లీగ్‌ను పునరుద్ధరించాలనే ఐసీసీ ప్రతిపాదనలో ఎన్ని జట్లు పాల్గొంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, ఈ లీగ్ 2028 నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉందిఈ చొరవ 50 ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా ప్రత్యామ్నాయం కాకుండా, దానికి బలమైన నిర్మాణాన్ని అందించడం ద్వారా దాని ఔచిత్యాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఒక అధికార తో తెలిపారు. “సూపర్ లీగ్ 50-ఓవర్ల ఫార్మాట్‌కు కొత్త జీవం పోయడానికి సహాయపడుతుంది. అందుకు సరైన నిర్మాణాన్ని కనుగొనడమే” అని ఒక నిర్వాహకుడు పేర్కొన్నట్లు పేర్కొంది.
ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ, పాలక మండలి ప్రస్తుతం ప్రపంచ కప్ ఫార్మాట్‌ను 14 జట్లకు మించి విస్తరించడాన్ని పరిశీలించడం లేదు. గత ఎడిషన్లలో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి.
వన్డే ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, వన్డే ప్రపంచ కప్ 2023లో రన్నరప్‌గా నిలిచింది. గ్రూప్ దశలో అద్భుతంగా ఆడి, నాకౌట్ దశకు అజేయంగా చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించింది.అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా చేతిలో జట్టు ఓటమి పాలైంది. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి రెండు స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిలిచారు.కోహ్లీ 11 మ్యాచ్‌లలో 95.62 సగటు, 90.32 స్ట్రైక్ రేట్‌తో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అతను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. రోహిత్ 11 మ్యాచ్‌లలో 54.27 సగటు, 125.95 స్ట్రైక్ రేట్‌తో 597 పరుగులు చేశాడు. అతని పేరిట ఒక సెంచరీ ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular