ప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.
శ్రీకాళహస్తి, ఏర్పేడు:
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మహిళా కోట కింద డైరెక్టర్ పదవికి ఏర్పేడు మండలం మేర్లపాకగ్రామానికిచెందినకే.కే.భాగ్యలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జలసుధీర్ రెడ్డి సిఫారసుల మేరకు జరిగింది.కేకేభాగ్యలక్ష్మిభర్తకేకేరమణతెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉంటూ, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి విజయానికి విశేషంగా పనిచేశారు. వారి సేవలను గుర్తిస్తూఎమ్మెల్యేఆకుటుంబానికి డైరెక్టర్ పదవిని అందజేశారు.డైరెక్టర్గానియమించబడినసందర్భంగా కేకే రమణ, ఆయన సతీమణి కేకే భాగ్యలక్ష్మి కలిసి ఎంపీ బొజ్జల సుధీర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు దుశ్శాల వేడుకతో ఘన సన్మానం చేశారు.
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కే.కే. భాగ్యలక్ష్మి నియామకం.
RELATED ARTICLES

