మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి నవంబర్ 17:
ప్రజల ఆరోగ్య సహాయార్థం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముందుకు వచ్చారు. సదాశివపేట్ కు చెందిన తాహీరా బేగం అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చికిత్స ఖర్చుల భారం తగ్గించేందుకు (ఎల్ ఓ సి) ను వారి కుమారుడు హర్షద్ కు ఎమ్మెల్యే అందజేశారు.బాధితులు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వారి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అవసరమైన ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా సహాయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది… బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు…

