Friday, February 27, 2026
ads
Homeఇంటర్నేషనల్ఆర్‌బీఐ జోక్యం..

ఆర్‌బీఐ జోక్యం..

📰 Generate e-Paper Clip

– పతనాన్ని దాటి మళ్లీ బలపడిన రూపాయి

న్యూఢిల్లీ, నవంబర్‌ 24,మనప్రజాప్రతినిధి:

అమెరికా కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి తాజాగా కొంత మేర బలపడింది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 26 పైసలు బలపడి 89.14 స్థాయికి చేరింది. గత వారం ముగింపులో నమోదైన పతనం తర్వాత ఇది గణనీయమైన పునరుత్థానం గా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల వరుసగా బలహీనపడుతూ చరిత్రలోనే అత్యల్ప స్థాయి 89.49 వరకు దిగజారిన రూపాయిని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో చురుకైన జోక్యం చేసుకుంది. విదేశీ కరెన్సీ నిల్వల ఉపయోగంతో డాలర్ అమ్మకాలు జరిపిన ఆర్‌బీఐ చర్యల వల్ల రూపాయి పతనం ఆగిపోయి తిరిగి బలపడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లడం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం గతంలో రూపాయి బలహీనతకు కారణాలయ్యాయి. అయితే ఇప్పుడు ఆర్‌బీఐ గట్టి చర్యలు తీసుకోవడంతో మార్కెట్లలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. ఇకపై రూపాయి 89.20 నుంచి 90.00 మధ్య స్థాయిలో ఊగిసలాడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రూపాయి బలపడిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా లాభాలతోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. పెట్టుబడిదారుల్లో నమ్మకం కొంత మేర పునరుద్ధరించబడిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల దిశపై ఆధారపడి రాబోయే రోజుల్లో రూపాయి దిశ నిర్ణయమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular