మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్22
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులకు యువ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మార్కాడి లావణ్య రవి, ఉప సర్పంచ్ సహా గ్రామ వార్డు సభ్యులను యువ నాయకుడు చిమ్మన కొట్టు శ్రీనివాస్ శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుధగోని శ్రీనివాథ్ గౌడ్, గడ్డమీది తిలక్ గౌడ్, నాగుల హరీష్, కొండ నరేష్, సమ సంతోష్, సిరిపురం లక్ష్మీనారాయణ, నల్గొండ శంకర్, పిల్లి ప్రణయ్, పిల్లి లచ్చయ్య తదితర యువ నాయకులు, గ్రామ యువకులు పాల్గొని నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వక్తలు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
వంతడుపుల గ్రామంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యులకు ఘన సన్మానం
RELATED ARTICLES

