మనప్రజాప్రతినిధిన్యూస్//రాయ్ కోడ్ జనవరి 26
అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ.
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్న వేళ, పీపడపల్లి గ్రామంలో అంబేద్కర్ స్టార్చ్ దగ్గర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో నూతనోత్సాహాన్ని నింపింది….
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భూతపిల్లీ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగం మనకు గర్వకారణమని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు.గ్రామ సెక్రెటరీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

