📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు🇮🇳 జాతీయ గర్వానికి ప్రతీకగా ఎగసిన త్రివర్ణ పతాకం 🇮🇳

🇮🇳 జాతీయ గర్వానికి ప్రతీకగా ఎగసిన త్రివర్ణ పతాకం 🇮🇳

📰 Generate e-Paper Clip

దుద్దెడ ఆరె క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.జనవరి26
దుద్దెడ గ్రామంలో ఆరె క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ స్పూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం దేశభక్తి నినాదాలతో అంబరాన్ని అంటింది.ఈ కార్యక్రమంలో ఆరె క్షత్రియ సంఘం అధ్యక్షులు కందుగుల కరుణాకర్, ఉపాధ్యక్షులు బూర్గుల రాజేష్, మాజీ ఎంఫీటీసీ గురజాడ బాలాజీ, శివాజీ యూత్అధ్యక్షులు దొడ్ల సురేష్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.సంఘ సభ్యులు ఇరువాల కాంతారావు, దొడ్ల నరేష్, కుటుంబ సతీష్, గాజులపాటి రాజు, కారడపల్లి బాలాజీ రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు వన్నె తెచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడటమే నిజమైన గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular