మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి:
సంగారెడ్డిలోని సంజీవనగర్ 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమేష్, గుడి దగ్గర ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించమని కోరారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

