📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమేళ్లచెరువులో దారుణం గొడ్డళ్లతో పరస్పర దాడులు

మేళ్లచెరువులో దారుణం గొడ్డళ్లతో పరస్పర దాడులు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు:

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు దిగాయి.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువర్గాలను అడ్డుకునే క్రమంలో మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌కు కూడా గాయాలయ్యాయి.ఘటనతో ఎర్రగడ్డతండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.