మానకొండూరు, నవంబర్ 28:
ఇల్లంతకుంట మండలంలో వివిధ పార్టీల నాయకులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . గాలిపల్లి సింగిల్ విండో డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, ముస్కాన్పెట్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రమేష్ రెడ్డి ప్రధానంగా చేరినారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకుల ప్రవేశంతో పార్టీ బలపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు

