మనప్రజాప్రతినిధి//మానకొండూర్.డిసెంబర్ 01
ఇల్లంతకుంటమండలంలోని వెల్జిపూర్ గ్రామానికి చెందిన నాయిని నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సర్పంచ్ పదవికి వెల్జిపూర్ గ్రామం నుంచి పోటీ చేస్తున్న నాయిని నవీన్ కుమార్ చేరికతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమంలో నాయకులు గుండ వెంకటేశం, గ్రామస్థులు మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

