Wednesday, February 11, 2026
ads
Homeతెలంగాణమంత్రి మీటింగ్ కి డుమ్మా కొట్టిన ఉపసర్పంచి, వార్డ్ మెంబర్లు...!

మంత్రి మీటింగ్ కి డుమ్మా కొట్టిన ఉపసర్పంచి, వార్డ్ మెంబర్లు…!

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, ఫిబ్రవరి 10:

నేరేడుచర్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్  ఎన్నికల ప్రచారంలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో నలుమూలల గ్రామాల నుండి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనాలని పార్టీ నాయకులు  పిలుపునిచ్చారు కానీ ఇక్కడ నేరేచర్ల పట్టణానికి 7 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న గ్రామం నుండి ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు హాజరు కాకపోవడంతో గ్రామంలో చర్చనీయంగా సాగుతుంది, అధికార పార్టీ , ఉన్న ఊరు మనుషులం , ఊరిని వదిలిపెట్టి పోమని చెప్పిన వ్యక్తులు ఎక్కడ ఇప్పుడు. ఎన్నికల సమయంలో ఓట్ల వచ్చినప్పుడే గుర్తుంటారా, అని ముక్కు మీద వేలు వేసుకుంటున్నా ప్రజలు మంత్రి మీటింగ్ కు గ్రామం నుండి ఒక్క వార్డ్ మెంబర్  మీటింగ్లో పాల్గొనడం చర్చనీయంగా ఉన్నది..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular