చిట్యాల మనప్రజాప్రతినిధి//ఆగస్టు 28
చిట్యాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా వై. సతీష్ (ఎడ్లపల్లి సతీష్) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ:
శాంతిభద్రతల పరిరక్షణ: సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం: జూదం, అక్రమ మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రజల సమస్యల పరిష్కారం: ఠాణాకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎడ్లపల్లి సతీష్
RELATED ARTICLES



