చిట్యాల ఆగస్టు 28 మన ప్రజాప్రతినిధి
చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల వంశతుడైన ఆర్ బి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పుల్ల రవితేజ పై జరిగిన దాడి విషయం తెలుసుకున్న పుల్ల వంశస్తులు వివిధ గ్రామాల నుండి విచ్చేసి అతడిని శుక్రవారం రోజున పరమర్శించారు. దాడికి సంబందించిన వివరాలు తెలుసుకోని వారు మాట్లాడుతూ ఇది చాల దుర్మార్గమైన దాడి అని,వారిని కొట్టుకుంటూ ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుల్ల రవీందర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని చెప్పారు.పుల్ల వంశస్తులపై ఎలాంటి దాడి జరిగిన సహించబొమన్నారు. పుల్ల వంశాస్తులపై జరిగే దాడులు దౌర్జన్యాలు చేసే వారికి తగిన బుద్ధి చెపుతమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పుల్ల వంశస్తుల అంటే ఏమిటో చూపిస్తామన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సమాజంలో తోటి మనుషులను గౌరవిస్తూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలన్నారు.
పరామర్శించిన వారు పుల్ల వంశస్తులు అంబేద్కర్ స్టడీ సెంటర్ ఉపసంచాలకులు డాక్టర్ పుల్ల శ్రీనివాస్, ప్రభాకర్ సార్ , కమలపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ,ఇతార గ్రామాల వార్డు సభ్యులు రాద, శ్రీనివాస్, చిట్యాల 3వ వార్డ్ సభ్యులు పుల్ల నిర్మల సతీష్, రిటైడ్ ప్ర.ఉపాద్యాయులు, ఇంజనీర్ కుమార్, లెక్చరర్ కుమార్ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు అశోక్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్, సతీష్ కుమార్ , MRPS రాష్ట్ర సోషల్ మీడియా ఇచార్జీ హర్షవర్ధన్, ప్రవీణ్ సుమన్, శ్రీకాంత్ సమ్మయ్య సారయ్య సదయ్య, ప్రవీణ్ మున్నా తదితరులు పాల్గొన్నారు



