– ప్రతి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్న ప్రభుత్వం
– కాంగ్రెస్ పాలన మరో 15 ఏళ్లు కొనసాగుతుందని నేతల నమ్మకం
– మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మిర్యాలగూడ, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, ఎంఎల్సీ శంకర్ నాయక్ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భారీ ర్యాలీలతో స్వాగతించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చే దిశగా పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నల్లగొండను మౌలిక సదుపాయాల పరంగా మరింత బలపరిచే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కాలంలో కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ చేసిన ముఖ్యపని అని గుర్తుచేశారు. ప్రాంతీయ విద్యా, మౌలిక వసతుల అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రను నేతలు ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇంకా 15 ఏళ్లు కొనసాగుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రూ.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
RELATED ARTICLES

