_భారతీయ జనతా పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, నవంబర్28:
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయం సాధించాలని కోరారు. మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, నెరవేర్చలేక ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మరల స్థానిక ఎన్నికలకు ఏ ముఖంతో వస్తున్నారని, వారిని ఎన్నికల్లో ఓడించాలని ఈరోజు గ్రామాలకు కేంద్రం నుండి మాత్రమే నిధులు అంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.రాబోవు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

