📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుస్థానిక ఎన్నికల తొలి దశ ముగింపు

స్థానిక ఎన్నికల తొలి దశ ముగింపు

📰 Generate e-Paper Clip

మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ఘనంగా
చివరి రోజు అభ్యర్థుల సందడి.నామ పత్రాలు వెల్లువలా
పాపన్నపేట,
నవంబర్ 29(మనప్రజాప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశ శనివారం నాటితో అధికారికంగా ముగిసింది. ఈనెల 27న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 29వ తేదీతో పూర్తయి, మండలంలోని 40 గ్రామపంచాయతీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు అభ్యర్థుల సందడి కార్యాలయ వాతావరణాన్ని చురుకుగా మార్చింది.నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు మండల పరిషత్తు కార్యాలయంలో 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ఉదయం 10 గంటల నుంచి నామ పత్రాలు స్వీకరించడం ప్రారంభించారు. సర్పంచ్ మరియు వార్డు స్థానాల అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.మూడు రోజుల గణాంకాలు గురువారం (మొదటి రోజు): సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లుశుక్రవారం (రెండో రోజు): సర్పంచ్ స్థానానికి 25, వార్డు స్థానాలకు 22 నామినేషన్లుశనివారం (మూడో రోజు – చివరి రోజు): సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు వెల్లువలా నామ పత్రాలు దాఖలుఎంపీడీవో విష్ణువర్ధన్ తెలిపారు.“పాపన్నపేట నుంచి ఆకుల మంజుల, లింగంపేట నుంచి పావని, నరేందర్ గౌడ్, సబిత, భూమ గౌడ్ తదితరులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజుసిబ్బందిఅదనంగాఏర్పాటుచేయబడింది,”అనితెలిపారు.తదుపరిషెడ్యూల్30వతేదీ:నామినేషన్లపరిశీలనచెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా విడుదలనామినేషన్లఘనసమాప్తితోమండలంలో ఎన్నికల ఉత్సాహం పెరిగింది. గ్రామ గ్రామాల్లోఅభ్యర్థుల చర్చలు,వ్యూహాలు,సమావేశాలువేగం పెంచుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.