📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపరిష్కారమేలక్ష్యంగాగ్రీవెన్స్ డేకార్యక్రమంజిల్లాఎస్పీమహేష్ బి.గితే

పరిష్కారమేలక్ష్యంగాగ్రీవెన్స్ డేకార్యక్రమంజిల్లాఎస్పీమహేష్ బి.గితే

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్లడిసెంబర్8
జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ—“ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుని, చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవడం మా కర్తవ్యంమీద” అన్నారు.ఈరోజు జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 18 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు అందజేసి, బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అని ఆదేశించారు.ఎస్పీ మాట్లాడుతూ…పోలీస్ సేవలను మరింత ప్రజలకు చేరువ చేయడం మా లక్ష్యంస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదా రుల తోఅధికారులు మర్యాద పూర్వకంగామాట్లాడాలివి నతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసర మైతే క్షేత్ర స్థాయి విచారణ జరపాలి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలిఇలా వ్యవహరించడం వల్ల ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే గ్రీవెన్స్ డే లో నమోదైన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు సమర్థ వంతమైన సేవలు అందిస్తు న్నామని తెలిపారు.గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల నుఅధికారులకు తెలియజేసే అవకాశం లభించడంతో వాటిని వీలై నంత త్వరగా పరిష్కరించే పనిలో ఉన్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.