•ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ.
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి12
శ్రీకాళహస్తి పట్టణంలో సేవా భావం మరోసారి వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జయరాం రావు వీధిలో నెక్స్ట్ షోరూం సమీపంలో “హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ” ఆధ్వర్యంలోనిర్వహించిన సేవా కార్యక్రమం ప్రజల హృదయాలను తాకింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి హాజరుకాగా, ఆయనతో పాటు తుడా చైర్మన్ సోదరులు డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, బియ్యం మరియు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు, సమాజంలో పేదలు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి ఒక్కరూ గుర్తించి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సేవా భావంతో ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి సంస్థలకు ప్రజాప్రతినిధుల సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన మానవత్వమని, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం మనందరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ సేవా కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులుతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

