మనప్రజాప్రతినిధి//చేర్యాల,014
చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన బత్తుల పద్మ (55) ఈనెల 8న తన వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురై సిద్దిపేటలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


